ఆంధ్రప్రదేశ్‌

అధికారులు, కార్మికులకు చంద్రబాబు అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పక్కా ప్రణాళికతో కృష్ణా పుష్కరాలను నిర్వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, కార్మికులను అభినందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. పుష్కరాల ద్వారా పోలీసులంటే ప్రజా సేవకులని నిరూపించారని, విజయవాడను సుందరంగా తీర్చిదిద్దడంతో పురపాలకశాఖ పనితీరు ప్రశంసనీయమని చంద్రబాబు కొనియాడారు. పుష్కరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యద్భుంగా వినియోగించుకుని ఫలితాలు రాబాట్టామన్నారు. ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేయడం, స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరు వల్ల ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించారన్నారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా పుష్కర స్నానాలు చేయడం అభినందనీయమన్నారు.