ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ మహాధర్నాలో ఘర్షణ.. అరెస్టులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 May 2016
విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆందోళన వ్యక్తం చేసేందుకు సోమవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులను ఉసిగొల్పడం విడ్డూరంగా ఉందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, దేవినేని నెహ్రూ తదితరులు విమర్శించారు. ఎపి ప్రయోజనాల కోసం తాము చేపట్టే ఆందోళనలకు టిడిపి సహా అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు ఇవ్వాలని వారు కోరారు.