తెలంగాణ

కాంగ్రెస్‌ ధర్నాలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో గందరగోళం నెలకొంది.ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం కాంగ్రెస్‌ నేతలు కొట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా కోసం సభా వేదికపై కుర్చీని ఏర్పాటు చేశారు. ఈ కుర్చీపై అదే పార్టీకి చెందిన నాయకుడు గజ్జెల నగేశ్‌ కూర్చున్నారు. దీంతో నగేశ్‌ను సీనియర్‌ నాయకులు వీ. హనుమంతరావు ప్రశ్నిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ధర్నా వేదిక రణరంగంగా మారింది. అక్కడున్న మిగతా పార్టీల నాయకులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.