రాష్ట్రీయం

అందరి అభిప్రాయాలు సేకరిస్తాం: సీపీఐ రామకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. జేఏసీ, జేఏఫ్‌సీ ఏర్పాటుపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరిస్తామని అన్నారు. విభజన హామీలు ఏమున్నాయో... అందులో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసింది... ఇంకా చేయాల్సినవి ఏమున్నాయన్నదానిపై సమగ్రమైన అవగాహనతో ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జేపీ, ఉండవల్లి... పవన్‌తో కలిసి ఇదే ఆలోచనతో ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని రామకృష్ణ అన్నారు.