క్రైమ్/లీగల్
ఆటో కింద పడి చిన్నారి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 March 2020
జీడిమెట్ల, మార్చి 5: ఆటో కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దూలపల్లి గ్రామంలో నివాసముండే శ్రావణ్ కుమార్, వినిత దంపతులు. కిరాణ దుకాణాలకు సరుకులను పంపిణీ చేసే పనులు చేస్తారు. వీరి పాప 15 నెలల వయస్సు కలిగిన ఆరాధ్య. పాప మేనమామ హన్మంతు ఆటోను తీస్తుండగా వెనుక ఉన్న పాప ఆరాధ్య ఆటో కింద పడి మృతి చెందింది. ఈ ఘటనతో దూలపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.