క్రైమ్/లీగల్

వరకట్నం వేధింపులతో.. యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, డిసెంబర్ 20: పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని, మరింత కట్నం కావాలని నిత్యం భర్తతో పాటు ఆడపడుచు, మామ వేదించడంతో కట్నం ఇచ్చుకునే స్థితిలో కనిపెంచిన వారు లేరని మరణమే శరణ్యమనుకున్నదేమో ఓ అబల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుండి గ్రామానికి చెందిన ముంజం ప్రవీణ్‌కు వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ముంజం జ్యోతితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిపారు. పది వేల రూపాయలు కట్నం, ఇతర లాంచనాలు ఇచ్చారు. వీరికి పాప ఉంది. వీరి కాపురంలో కట్నం అనే రాక్కసి చిచ్చురేపింది. ప్రతీ రోజు భర్త ప్రవీణ్, మామ మల్లయ్య, ఆడపడుచు పుష్పలత, బావ దుర్గం వెంకటి కట్నం తేవాలంటూ వేదించ సాగారు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటిలోనే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.