క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, సెప్టెంబర్ 24: ఏజన్సీ నుండి మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీ ఐ సింహాద్రినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం పట్టణ పొలిమేర్లలో వాహనాల తనిఖీ చేస్తుండగా చింతపల్లి వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి బ్యాగ్‌లు పరిశీలించగా గంజాయిని గుర్తించామన్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న నర్సీపట్నం గండివీధికి చెందిన గండి కృష్ణ(25), గొలుగొండ మండలం పుత్తడిగైరంపేటకు చెందిన రూప గణేష్(25)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద ఉన్న రెండువేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయిని సీజ్ చేసామన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని అంచనా.