క్రైమ్/లీగల్

కబేళాలకు తరలిస్తున్న పశువులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జూన్ 17: అక్రమంగా కబేళాలకు పశువులను తరలిస్తున్న లారీపై స్థానిక పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి 67 పశువులను స్వాదీనం చేసుకున్నారు. మండలంలో యండపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై బి. మదుసూధనరావు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. యండపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం నుంచి అడ్డురోడ్డు వైపు వెళ్తున్న లారీలో పశువులు అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.లారీపై దాడి చేసిన పోలీసులు పరిశీలించగా శ్రీకాకుళం సంత నుంచి హైదరాబాద్ కబేళాకు రవాణా అవుతున్న 67 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ జబ్బర్ , హర్యానాకు చెందిన మహ్మద్ సుమ్మూర్‌ను అరెస్ట్ చేసారు. పశువులను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గోశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మధుసూధనరావు తెలిపారు.