క్రైమ్/లీగల్

మతి స్థిమితంలేని మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు పిబ్రవరి 18: మతి స్థిమితంలేని మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్లికురవ మండలం ముక్తేశ్వరం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. బల్లికురవ ఎస్సై అనూక్ తెలిపిన వివరాల ప్రకారం ముక్తేశ్వరం గ్రామనికి చెందిన కొండేటి అంజమ్మ(30) గత పదేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తుంది. ఈమె రెండు రోజులుగా గ్రామంలో కనిపించలేదు. ఈనేపద్యంలో ఆదివారం పొలం పనులకు వెళ్లిన కూలీలకు రోడ్డు పక్కన అంజమ్మ మృతి చెంది కనిపించింది. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై అనూక్ ఘటనా స్థలిని సందర్శించి పరిశీలించగా మృతురాలి పక్కన పురగు మందు సీసా ఉండటం ఆమె నోటి వెంట నరుగులు వచ్చి ఉండటాన్ని బట్టి ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావించినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలు అవివాహితురాలుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహనికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎసై అనూక్ తెలిపారు.