క్రైమ్/లీగల్

వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 3 : మడకశిర కొండపై సోమందేపల్లి మండలం మండ్లికి చెందిన హనుమంతు (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం మేకల కాపరులు మేకలను మేతకు తీసుకెళ్లి కాపరులు కొండపై ఉన్న పావురాలగుట్ట వద్ద వ్యక్తి మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై లింగన్న అక్కడికి చేరుకుని మృతుడి జేబులో లభ్యమైన డ్రైవింగ్ లైసెన్సు ఆధారంగా మృతుడు సోమందేపల్లి మండలం మండ్లికి చెందిన హనుమంతుగా గుర్తించారు. మడకశిర ప్రాంతంలో హనుమంతు బంధువులు ఉండటంతో ఇక్కడికి వచ్చిన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. హనుమంతు పురుగుల మందు తాగాడా లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డా అన్న విషయం పోస్టుమార్టంలో తేలాల్సి ఉందని ఎస్సై తెలిపారు. ఈమేరకు బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ధర్మవరం, జులై 3 : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పుట్టపర్తికి వెళ్ళే రహదారిలో ఓ ఇంటి వద్ద ఇంటి ప్రధాన గేట్‌కు ఆనుకుని ఉన్నపళంగా కూలిపోవడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.