క్రైమ్/లీగల్

గోదావరిలో యువతి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జూలై 5: కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన పైనుంచి గోదావరి నదిలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక యువతి దూకగా గల్లంతైనట్టు, ఆ యువతి రాజమహేంద్రవరానికి చెందిన సీహెచ్ బిందుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బిందు, జంగారెడ్డిగూడెంనకు చెందిన వెంకటేశ్వరరావు ప్రేమించుకున్నారని పోలీసులు తెలిపారు. వీరు రాజమహేంద్రవరం నుంచి మోటారుసైకిల్‌పై కొవ్వూరు వైపు వస్తుండగా బిందు మోటారుసైకిల్ దిగి గోదావరి నదిలో దూకిందని భావిస్తున్నామని వారు తెలిపారు. అయితే సంఘటనాస్థలంలో ఉన్న వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సుభాకర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని బిందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు వస్తేగానీ పూర్తి వివరాలు తెలియవని తెలిపారు.