క్రైమ్/లీగల్

తండ్రే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధరనెల్లూరు: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కసాయి తండ్రి తన ముగ్గురు బిడ్డలను కడతేర్చిన ఘటన సోమవారం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో జరిగింది. బాలగంగనపల్లి దళితవాడకు చెందిన వెంకటేష్ (35)కు ఏడేళ్ల క్రితం దళితవాడకు చెందిన అమ్ములును వివాహం చేసుకోగా ఆమెకు ఒక కుమార్తె జన్మించింది. సంవత్సరం తరువాత మొదటి భార్య చెల్లెలు అమరావతిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈక్రమంలో అమరావతి ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది. తన తల్లికి జబ్బు చేయడంతో అమరావతి తన ముగ్గురు పిల్లలతో కొన్ని రోజుల క్రితం శెట్టిగారిపల్లెకు వచ్చి తల్లికి ఆసరాగా ఉంటోంది. అయితే ఆదివారం రాత్రి నిందితుడు వెంకటేష్ తన అత్తగారింటికి చేరుకొని పిల్లలతో పాటు భార్యను బాలగంగనపల్లెకు రావాలన్నాడు. అయితే ఇందుకు అమరావతి నిరాకరించింది. రాత్రిపూట ప్రయాణం వద్దు, సోమవారం ఉదయం గ్రామానికి వెళదామని భర్తకు సద్దిచెప్పే ప్రయత్నం చేసింది. అప్పటికే అతిగా మద్యం సేవించిన వెంకటేష్ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం కోపంతో రగిలిపోయిన వెంకటేష్ తన ముగ్గురు పిల్లలు పునీత్ (5), సంజయ్ (3), రాహుల్ (1)ను తీసుకుని మోటార్‌సైకిల్‌పై తన గ్రామానికి బయలు దేరాడు. విచక్షణ కోల్పోయిన స్థితిలో తన ముగ్గురు పిల్లల్ని గంగాధరనెల్లూరులోని నీవానదిలో పడేశాడు. దీంతో ముగ్గురు నీటమునిగి మృతి చెందారు. అనంతరం మోటార్‌సైకిల్‌పై తన గ్రామ సమీపంలోని సిద్దేశ్వరకొండ గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న వీధి నాటకాన్ని తిలకించాడు. ఉదయం వరకు అక్కడే వున్న వెంకటేష్ మద్యం మత్తు దిగడంతో జరిగిన విషయాన్ని తన భార్య అమరావతికి ఫోన్‌లో తెలిపాడు. దీంతో హైరానాపడ్డ అమరావతి, ఆమె బంధువులు కలసి నీవానదిలో వెతకడంతో ముగ్గురు పిల్లలు విగతజీవులై నీళ్లపై తేలుతూ కనిపించారు. ఈ సమాచారం అందుకున్న గంగాధరనెల్లూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఇదిలావుండగా నిందితుడు వెంకటేష్‌ను ఎస్‌ఆర్ పురం ఎస్సై వాసంతి తన బృందంతో వెళ్లి తమిళనాడులోని పళ్లిపట్టులో అరెస్ట్ జీడీనెల్లూరు పోలీసులకు అప్పగించారు.