క్రైమ్/లీగల్

వాహనం ఢీ కొని ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఆగస్టు 13: నగరం నుండి ఇంకి వెళుతున్న ముగ్గురు యువకుల బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తూప్రాన్ పట్టణ శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తూప్రాన్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన యువకులు రాజు, సంతోష్, సురేష్‌లు టీఎస్ 35-2668 నంబరు గల ఫల్సర్ వాహనంపై స్వగ్రామానికి వెళుతున్నారు. తూప్రాన్ పట్టణ శివారులోని ఓ దాబా సమీపంలోకి రాగానే వెనుకనుండి గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు రోడ్డు ప్రక్కన పడి విగత జీవులయ్యారు. ఈ సంఘటనను చూసిన దాబా యజమానులు, ఇతర వాహన చోదకులు పోలీసులకు సమాచారం అందించారు. తూప్రాన్ పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు ముందు తూప్రాన్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో వాహనాల రాకపోకలు రికార్డు కానుండటంతో తూప్రాన్ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కిన ఫల్సర్ వాహనం నంబర్ ప్లేట్ పైభాగంలో పోలీస్ అని వ్రాసి ఉండటంతో ఇందులో ఎవరైనా పోలీసు ఉద్యోగం చేస్తున్నాడా, లేక వాహనం పోలీసు ఉద్యోగిదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.