క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, ఆగస్టు 16: ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై పెంటయ్య, ప్రయాణికుల కథనం ప్రకారం పోతన్‌శెట్టిపల్లి హనుమ్‌బండాల్ సమీపంలో సికింద్రబాద్ నుండి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు కిష్టాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి యాదగిరి(28), మహ్మద్ ఆసీఫ్(26)లు బైక్‌పై కొల్చారం వైపు వస్తున్నారు. హనుమాన్ బండల్ మూలమలుపు వద్ద అతివేగంగా వస్తూ బస్సును ఢీకొట్టారు. వెంటనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలికి వెళ్లేసరికి కిష్టాపూర్ గ్రామస్తులకు భారీ సంఖ్యలో తరలివచ్చి కుటుంబీకులు, ఆర్టీసీ డీఎం వచ్చి న్యాయం చేసేంత వరకు వెళ్లమంటూ భీష్మించుకొని ధర్నాకు కూర్చున్నారు. విషయాన్ని మెదక్ సీఐ రామకృష్ణకు తెలపడంతో ఆయన అక్కడికి చేరుకొని వారిని సముదాయించినా వినలేదు. దీంతో రెండు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ మాట్లాడుతూ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, మృతుల కుటుంబాలకు ఆర్దిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా మహమ్మద్ ఆసీఫ్‌కు ఈ నెల 2న వివాహం జరిగింది. గురువారం మెదక్ నుండి ట్రాక్టర్‌కు డీజీల్ తీసుకువచ్చి శాది ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి కొల్చారం బయలుదేరాడు. ఈయన మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.