క్రైమ్/లీగల్

దంపతులపై దొంగల దాడి ..గుండెపోటుతో భర్త మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 17: రాజేంద్రనగర్ పరిధిలో ముగ్గురు దుండగులు భార్యాభర్తలపై దాడి చేసి విలువైన బంగారు ఆభరణాలు.. నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రాజేంద్రనగర్ పరిధిలోని సిరిమల్లెనగర్ కాలనీలో రాజేంద్రప్రసాద్ భార్యతో నివాసముంటున్నాడు. రాజేంద్రప్రసాద్‌కు బేగంబజార్‌లో హోల్‌సేల్ షాపు ఉంది. రాజేంద్రప్రసాద్‌కు నలుగురు దీపక్, రోహిత్, పూజ, రేణుక సంతానం. దీపక్ అత్తాపూర్‌లోని ఆంబియన్‌స్పోర్ట్‌లో నివసిస్తున్నాడు. రోహిత్ ఆరుమాసాల క్రితం తండ్రితో గొడవ పడి న్యూ ఫ్రెండ్స్‌కాలనీలో నివసిస్తున్నాడు. ఈ తరుణంలో గురువారం అర్ధరాత్రి రాజేంద్రప్రసాద్ ఇంటికి ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఇంటికి వచ్చారు. ముగ్గురు కలిసి రాజేంద్రప్రసాద్ దంపతులు అరవకుండా నోట్లో బట్టలు కుక్కి, చేతులు కట్టేసి వారిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న రూ.50 లక్షలు, 40 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. రాజేంద్రప్రసాద్ భార్య కిచెన్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న కత్తితో చేతులకు ఉన్న తాళ్లను కట్ చేసుకొని పక్కన ఉన్న వారికి తెలపగా, దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. తెలిసినవారు చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.