క్రైమ్/లీగల్

వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 27: తెలుగు యువత అధ్యక్షుడు సుధాకర్ దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వమని హతుడు వేధించడంతో దూరపు బంధువే సుత్తితో తలపై బలంగా మోదడంతో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
స్థానిక శివాజీపాలెంలో నివాసముంటున్న నైదాన సుధాకర్ కెజిహెచ్‌లో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. దీంతో పాటు స్థానిక వార్డు టిడిపి యువజన సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా అదే ప్రాంతంలో ఉంటున్న దుక్క శివ ఆప్టింగ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సుధాకర్, శివల మధ్య దూరపు బంధుత్వముందని, శివ వరుసకు సుధాకర్‌కు మావయ్య ఆవుతాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఖాళీ సమయాల్లో కలిసి తిరుగుతూ మద్యం సేవిస్తుంటారని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం సమయంలో శివాజీపార్క్ సమీపంలోని మెకానిక్ దుకాణం వద్ద ఉన్న శివ దగ్గరికి సుధాకర్ వెళ్లి మద్యం సేవించడానికి డబ్బులు ఇమ్మని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని శివ చెప్పడంతో సుధాకర్ అతనిని బూతులు తిట్టడం ప్రారంభించాడు. దీంతో శివకు కోపం వచ్చి పక్కనే ఉన్న సుత్తితో సుధాకర్ తలపై బలంగా మోదాడు. తలకు బలమైన గాయమవ్వడంతో సుధాకర్ కుప్పకూలి పోవడంతో కుటుంబీకులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. వెంటనే 108అంబులెన్స్ అక్కడకు చేరుకుని, సుధాకర్‌ను కెజిహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సిఐ కరణం ఈశ్వరరావు నేతృత్వంలో ఎంవీపీ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.