క్రైమ్/లీగల్

200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఆగస్టు28: మదనాపురం మండల కేంద్రంలోని సవిల్ సప్లయి గోదాం వద్ద రేషన్ బియ్యాన్ని కొందరు వ్యక్తులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఏపి22వి9938 అనే నెంబర్ గల లారీలో పెబ్బేరు మండల కేంద్రం నుండి విజయట్రేడర్స్ మిల్లు ద్వారా ఈ రేషన్ బియ్యాన్ని తరలించగా కాపు కాచి పట్టుకున్నారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు డీసీవోతో పాటు విజిలెన్స్ సి ఐ శ్రీ్ధర్ రేషన్ లారీనీ తనిఖి చేసి విచారణ చేపట్టారు. బియ్యాన్ని శాంపిల్ నిమిత్తం ల్యాబ్‌కు పంపించి బియ్యం రీసైకిల్ అయ్యాయా లేదా అని పరిశీలించిన తరువాత కేసు నమోదు చేస్తామన్నారు. అక్రమ వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొత్తకోట, మదనాపురం మండలల్లో జోరుగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. పట్టుబడిన బియ్యం 200 క్వింటాళ్లు కాగా 400 బస్తాలు ఉన్నట్లు తెలిపారు.