క్రైమ్/లీగల్

హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్లు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 7: నగదు కోసం ఓ వ్యక్తిని బ్లేడుతో కోసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి గూడూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె రామకృష్ణారావు ఏడేళ్లు జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గూడూరు దళితవాడలో ఏప్రిల్ 3, 2018న కొళ్లపూడి శీనయ్య అనే వ్యక్తిపై బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన గడ్డం ప్రేమకుమార్‌రెడ్డి అనే వ్యక్తి నగదు కోసం దాడి చేసి బ్లేడుతో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ కేసు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ శేఖర్‌బాబు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా గూడూరు సబ్ కోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం నిందితుడికి ఏడేళ్లు జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ కొత్తపల్లి వసంతకుమార్ వాదించారు.