క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 14: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన నర్సంపేట మండలంలోని రాజపల్లెలో బుధవా రం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజపల్లెకు చెం దిన కర్ర సరోజన (57) భర్త వీరస్వామి కొనే్నళ్ల క్రితం మృతిచెందాడు. కాగా సరోజన అనారోగ్యంతో బాధపడుతూ మాటపడిపోయ మంచానికే పరిమితిమయింది. బుధవారం అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్ విద్యుత్ సర్క్యూట్‌కు కాలిపోయి వైర్లు ఆమెపై పడిపోయాయి. విద్యుత్ షాక్‌కు గురైన సరోజన మంచంలోనే మృతిచెందింది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి సరోజన విగత జీవిగా కనిపించింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నా రు. సంఘటనా స్థలాన్ని నర్సంపేట ఏసీపీ సునీతా మోహన్, సీఐ కొత్త దేవేందర్‌రెడ్డిలు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.