క్రైమ్/లీగల్

వెంగంపల్లిలో వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవణంపల్లి, సెప్టెంబర్ 14: మండల పరిధిలోని వెంగంపల్లిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై ఉమామహేశ్వర రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, వెంగంపల్లి గ్రామానికి చెందిన మొగిలి రెడ్డి (46) గురువారం రాత్రి గ్రామ సమీపంలోని తన పంట పొలాల వద్ద పశువులకు కాపలాగా పడుకొన్నాడు. శుక్రవారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసారు. ఉదయం కుటుంబ సభ్యులు పొలం వద్ద మొగిలి రెడ్డి హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేసారు. చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, సిఐ శ్రీనివాస రావు, ఎస్సైతో కలిసి సంఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామస్థులను విచారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై మాట్లాడుతూ వివాహేతర సంబంధంతోనే మొగిలి రెడ్డి హత్య జరిగినట్లు, ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మొగిలి రెడ్డి హత్యతో వెంగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.