క్రైమ్/లీగల్

స్కూలు బస్సు ఢీకొని బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, సెప్టెంబర్ 15: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని యతిరాజాపురం తండా గ్రామంలో చోటు చేసుకుంది. ఏ ఎస్సై జయకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన సాయి విద్యానికేతన్ పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకునేందుకు యతిరాజాపురం తండా గ్రామానికి వచ్చింది. ఆ సమయంలో గుగులోత్ హర్షిత (5). తన నాయనమ్మతో పాఠశాల బస్సు ఎక్కేందుకు మెయిన్‌రోడ్డు వద్దకు వచ్చింది. ఇంటిదగ్గరే ఉంటున్న హర్షిత తమ్ముడు జగదీష్ (3) కూడా తన అక్కతోపాటు బస్సు వద్దకు వచ్చాడు. హర్షిత బస్సు ఎక్కగా జగదీష్ బస్సు కిందకు వెళ్లింది ఎవరూ గమనించలేదు. ఇంతలో డ్రైవర్ రాజు బస్సు కదిలించగా జగదీష్ బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి తండ్రి రంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఏ ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 15: రోడ్డుప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన శనివారం నల్లగొండ మండలం కొత్తపల్లి శివారులో దేవరకొండ రోడ్డుపై చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ మురళీ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హిమగిరి కాలనీకి చెందిన సుంకిరెడ్డి కోటిరెడ్డి(56) గుర్రంపోడు మండలం పిట్టలగూడెం పాఠశాలలో హిందిపండిట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం పాఠశాలకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు.