క్రైమ్/లీగల్

వినాయకచవితి వేడుకల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింజమూరు, సెప్టెంబర్ 15: వినాయకచవితి వేడుకల్లో విషాద సంఘటన శనివారం బొమ్మరాజుచెరువు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొమ్మరాజు చెరువు గ్రామంలో గణనాథుని నిమజ్జనోత్సవంలో భాగంగా అక్కడ వాయిద్యాలు ముగించుకుని వింజమూరుకు బైక్‌లో వస్తుండగా వింజమూరు నుండి కావలి వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో వింజమూరు జివికెఆర్ గిరిజన కాలనీకి చెందిన అల్లూరి వెంకటేశ్వర్లు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు బైక్ వెనుక ఉన్న బట్టువారిపాళెంకు చెందిన లక్ష్మయ్య (28) , టాటా మ్యాజిక్ డ్రైవర్ నక్కా శివకుమార్‌కు తీవ్ర గాయలయ్యాయి. వీరిని హుటాహుటిన 108లో ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స పొందుతూ లక్ష్మయ్య మృతి చెందగా శివకుమార్‌కు కంటికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. వీరిలో మృతుడు లక్ష్మయ్యది బట్టువారిపాళెం కాగా శివ కుమార్‌ది కావలిగా తెలిసింది. సమాచారం తెలుసుకున్న సబ్ ఇన్స్‌పెక్టర్ ఎస్‌కె.జిలాని సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
విలపిస్తున్న కుటుంబ సభ్యులు
వినాయకచవితి వేడుకల్లో భాగంగా తన ప్రవృత్తి అయిన డప్పు వాయించేందుకు వెళ్లి ప్రమాదంలో మరణించడంతో వెంకటేశ్వర్లు భార్య, ఇద్దరు సంతానం కన్నీటి పర్యంతమయ్యారు. కాలనీవాసులు సైతం ఈ ప్రాంతంలో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా కాలనీలోని బ్యాండు బృందాన్ని సంతోషంగా తీసుకువెళ్లేవాడని అలాంటి వ్యక్తి అకాల మృతితో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.