క్రైమ్/లీగల్
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 September 2018
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కృష్ణా నది జాలలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన చేసేందుకు ఉద్దేశించబడిన జస్టిస్ బ్రీజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్లో సాగునీటి అంశంపై తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ సోమవారం ముగిసింది. తెలంగాణ తరపు న్యాయవాది రవీందర్రావు ఆంధ్రప్రదేశ్ తరపు సాక్షిగా ఉన్న సుబ్బారావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా నదిలోని జలాల లభ్యత హైడ్రాలజీపై తెలంగాణ తరపు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ తరపున నీటి లభ్యత విషయంలో సాక్షిగా ఉన్న విశే్వశ్వర్రావును ట్రిబ్యునల్ ముందు మంగళవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.