క్రైమ్/లీగల్

బాబ్లీ వారెంట్లపై రీకాల్ పిటిషిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌కు సంబంధించి రీకాల్ పిటిషన్ వేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. బాబ్లీ అంశానికి సంబందించి ఈనెల 21వ తేదిన కోర్టుకు హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు అదేశించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మంత్రులు, అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించిన సీఎం చంద్రబాబు రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈనెల 23 నుండి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ పర్యటనకు ఎటువంటి అడ్డంకి ఉండకూడదని ఈ రీకాల్ పిటిషన్ నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. దీనికి సంబందించి బాబ్లీ ప్రాజెక్టు నోటీసుల వ్యవహారంలో ధర్మాబాద్ కోర్టుకు తన తరుపున సీనియర్ లాయర్‌ను పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.