క్రైమ్/లీగల్

రైలు ఎక్కబోతూ.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, సెప్టెంబర్ 24: విశాఖపట్నం వైపు వెడుతున్న స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కబోతూ రైలు బోగి ఢీకొని కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి ఉదంతం ఇది. సామర్లకోట రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్థానిక రైల్వే స్టేషన్‌లో ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫాంపై విశాఖపట్నం వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రైలు బోగిలోకి ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ బోగిని తలకు ఢీకొట్టి ప్లాట్‌ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని రైల్వే పోలీసులు హుటాహుటిన ఆటోలో చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను అపస్మారక స్థితికి చేరడంతో వివరాలు తెలియరాలేదని రైల్వే హెచ్‌సీ జె గోవిందరావు చెప్పారు. అతని జేబులో సోమవారం ఉదయం 11.56 గంటలకు తుని రైల్వే స్టేషన్‌లో సామర్లకోట వరకూ కొనుగోలు చేసిన ఫాసింజర్ టికెట్ తప్ప మరే ఇతర ఆధారాలు లేవన్నారు. అతని వంటిపై నీలం రంగు జీన్ ప్యాంట్, ఎరుపు రంగు బనియన్, తెలుపు రంగు గళ్ల చొక్కా, చేతికి కడియం ధరించి ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రుని బంధువులు ఎవరైనా ఉంటే సెల్ నెంబర్ 90308 49003లో సంప్రదించాలని కేసు దర్యాప్తుచేస్తున్న రైల్వే హెచ్‌సీ గోవిందరావు తెలిపారు.