క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో దంతవైద్యుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, సెప్టెంబర్ 25: మామిడిపల్లి పాతజాతీయరహదారి వద్ద మంగళవారం ఉదయం సంభవించిన రోడ్డుప్రమాదంలో తురకశాసనం గ్రామానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు వై.బీమాశంకరరావు(33) మృతి చెందాడు. బారువ పోలీసులు, కుటుంబీకులు కథనం ప్రకారం తన సమీప బంధువు బావను కటక్‌కు పంపించే నిమిత్తం మంగళవారం తెల్లవారున హరిపురం రైల్వేస్టేషన్‌లో సాగనంపి తిరిగి వస్తుండగా చిన్నమామిడిపల్లి, మామిడిపల్లిల మధ్య ఆయన పయనిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పడంతో చెట్టుకు బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జుకావడంతో వాహనాన్ని నడుపుతున్న వైద్యుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇదే కారులో వెనుక సీటులో అక్క కూతురు జాగృతి ప్రయాణిస్తుంది. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడింది. సంఘటన జరిగిన వెంటనే చెట్టుకు ఢీ కొన్న కారు జీడితోటలోకి దూసుకుపోవడంతో కారు వెనుక సీటులో వున్న జాగృతి కేకలు పెట్టడంతో అటుగా వస్తున్న రైతులు కారు తలుపులు పగలగొట్టి జాగృతిని బయటకు లాగారు. కారు నడుపుతున్న వైద్యుడు బయటకు లాగేసరికి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సోంపేట సీ ఐ సన్యాసినాయుడు, బారువ ఎస్ ఐ సందీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న సోంపేట, పలాస, హరిపురం వైద్యులు, స్నేహితులు మృతుడి అంత్యక్రియాల్లో పాల్గొనడానికి తరలివచ్చారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, సోంపేట జడ్‌పిటీసీ చంద్రమోహన్, ఎంపీపీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మృతుడుకు భార్య అనిత, మూడేళ్లు పాప, ఆరునెలల కుమారుడు వున్నారు.