క్రైమ్/లీగల్
ఆమె మరణించి.. జీవించింది !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 September 2018
చొప్పదండి, సెప్టెంబర్ 28: తన కళ్లను దానం చేసి పది మందికి చూపు కల్పించాలన్న ఆమె కోరికను ఆమె మరణానంతరం వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు కరీంనగర్ లయన్స్ క్లబ్కు సమాచారాన్ని అందించడంతో వారు వెంటనే చేరుకొని నేత్రాలను సేకరించారు. ఈ మేరకు చొప్పదండి మండలంలోని కొలిమికుంట గ్రామానికి చెందిన గుడిపాటి లక్ష్మి (76) శుక్రవారం ఉదయం మరణించింది. మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. లక్ష్మి దహన సంస్కారానికి తాజా, మాజీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. గుడిపాటి లక్ష్మి నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వి కంటి ఆసుపత్రికి తరలించారు.