క్రైమ్/లీగల్

‘టాక్సీవాలా’ సన్నివేశాలు లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, సెప్టెంబర్ 30: విజయ్ దేవరకొండ హీరోగా, ప్రియాంక హీరోయిన్‌గా నటించిన టాక్సీవాలా సినీమాలో కొంతమంది టెక్నీషియన్స్ కొన్ని సన్నివేశాలను బయటకు విడుదల చేశారని, దీనివల్ల ఆ సినిమా రిలీజ్ కాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, యర్నగూడెం పరిసర ప్రాంతాల్లో మొబైల్స్‌లో హల్‌చల్ చేశాయని ఆ సినీ నిర్మాత జి శ్రీనివాస కుమార్ నాయుడు దేవరపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొవ్వూరు రూరల్ సీఐ సి శరత్ రాజ్ కుమార్, దేవరపల్లి ఎస్సై పి వాసులు సెప్టెంబర్ 28న కేసు నమోదు జేసి దర్యాప్తు చేశారు. యర్నగూడెం పరిసర ప్రాంతాల్లో ఏడుగుర్ని అదుపులోనికి వారిని ప్రశ్నించారు. టాక్సీవాలా సినీమాకు సంబంధించి చోరీకి పాల్పడిన అసలు దోషులను త్వరలోనే పట్టుకుంటామని సిఐ శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై వాసులు ఆదివారం స్థానిక విలేఖర్లకు తెలిపారు. దోషులను పట్టుకునేందుకు చెన్నైకు పోలీసు బృందాన్ని పంపించనున్నట్టు సీఐ చెప్పారు. సినిమా నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు మాట్లాడుతూ గీతా ఆర్ట్స్ ఎస్‌కెఎన్ బ్యానర్‌పై సుమారు రూ.8కోట్ల వ్యయంతో గత ఫిబ్రవరిలో చలన చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించామని, సినీమా షూటింగ్ పూర్తయిందన్నారు. డిజిటల్ వర్క్స్ పూర్తి చేసుకుని సినీమాను నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ముహూర్తం పెట్టుకున్న తరుణంలో సినీమా డిజిటల్ సీన్స్‌ను కొంతమంది అపహరించారని చెప్పారు. సినీమా రిలీజ్ తర్వాత కన్నా సినీమా ముందు వచ్చే ఇటువంటి సంఘటనలు వస్తే ఎక్కువ నేరమన్నారు. యువత ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదని, తాము కేసులు పెడితే యువత బంగారు భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. నిర్మాత కోరిక మేరకు వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు సీఐ శరత్ రాజ్ కుమార్ తెలిపారు. సమావేశంలో దేవరపల్లి రామనాథ్, త్రినాధ్ థియేటర్ల యజమాని తీగల ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.