క్రైమ్/లీగల్
విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 October 2018
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై దాఖలైన పిటిషన్లు విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది. ఈ పిటిషన్లు బుధవారం జస్టిస్ అభయ్ మనోహర్ సప్రె, జస్టిస్ ఇందు మాల్హోత్రతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఉద్యోగుల విభజన సంబంధించిన ప్రతిపాదనల ప్రతిని ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది గిరి అందించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రతివాదులకు కాపీలను అందరికి అం దించాలని ధర్మాసనం తెలంగాణ తర ఫు న్యాయవాదికి సూచించింది. దీనిపై ప్రస్తుతానికి ఎటువంటి అదేశాలు ఇవ్వాలేమని, దీనిపై అన్ని అంశాలను అక్టోబరు 24న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.