క్రైమ్/లీగల్

మేనమామ, బావమరదుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 9: మేనమామ, బావమరుదులను దారుణంగా హత్య చేసి మృతదేహాలను అటవీ ప్రాంతంలో పడేసిన వైనం చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో చోటుచేసుకొంది. ఈ జంట హత్యలు జిల్లాలో కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం హత్య చేసి మృతదేహాలను యాదమరి మండలం కోటాలం అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లగా మంగళవారం సాయంత్రం పశువుల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా మృతులు గుర్తు తెలియని వ్యక్తులని పోలీసులు భావించగా, మృత దేహాలను స్థానికులు గుర్తించి హత్యకు గురైన వారు యాదమరి మండలం వేపన పల్లి దళితవాడకు చెందిన వారుగా నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి మండలం వేపనపల్లి దళిత వాడకు చెందిన మామ, బావమరుదులైన జయచంద్ర (35), బాబు (30) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లారు. వీరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృత దేహాలను కోటాల అటవీ ప్రాంతంలో పడేసి పారి పోయారు. ఈ విషయం మంగళవారం సాయంత్రం పశువులు కాపర్లు గుర్తించడంతో వెలుగు చూసింది. వీరిని ఎక్కడో కత్తితోనరికి తర్వాత మృత దేహాలను అటవీ ప్రాంతంలో పడేసినట్లు గుర్తించారు. ఈ హత్యలు రెండు రోజుల క్రితం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అక్రమ సంబంధమే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృత దేహాలను పంచనామా నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంట హత్యలు జిల్లాలో సంచలనం సృష్టించగా, పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రాజశేఖర్ బాబు పరిశీలించారు.