క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) అక్టోబర్ 10: రాజధాని పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇరువురు బుకీల గుట్టు రట్టు చేసి వారి వద్దనుంచి రూ 2.29ల నగదుతో పాటు, ల్యాప్‌ట్యాప్, టీవి, కారును స్వాధీనం చేసుకున్నారు గుంటూరు అర్బన్ పోలీసులు. బుధవారం అర్బన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అదనపు ఎస్పీ వైటి నాయుడు నిందితుల వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లాకు చెందిన మాదాల నవీన్, అత్తలూరి నవీన్‌లు ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తు అమాయక యువతను వలలో వెసుకుని వారితో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో గుంటూరు అధిత్య నగర్‌కు చెందిన గుండిపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో భారత్‌నగర్ మెదటిలైన్‌లోని అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వీరిద్దరని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 2.29 లక్షల నగదుతో పాటు, 9 సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్, టీవి, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపించారు. వారి వద్ద నుంచి సేకరించిన వివరాల ప్రకారం మరికొంత మందిపై కూడా కేసలు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో నల్లపాడు సిఐ బాలమురళికృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.