క్రైమ్/లీగల్

28 మంది స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 24: నెల్లూరు జిల్లాలో బుధవారం చేపట్టిన తనిఖీల్లో 29 మంది అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.80లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలు, వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 27 మంది తమిళనాడు, ఒకరు కేరళ, మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. వీరంతా నల్లమల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి చెన్నై ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో నిందితులు దొరికారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లు ఎల్.చంద్ర, ఓబుల్ రాజా, సురేష్ ఉన్నారు. వీరి వద్ద నుండి రూ.63లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు బైకులు, 24 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.