క్రైమ్/లీగల్

దివిలిలో మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, అక్టోబర్ 25: భార్యపై నిందలు మోపుతుందనే అక్కసుతో తమ్ముడికి పిల్లనిచ్చిన అత్తను దారుణంగా హతమార్చాడో అన్న. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దివిలికి చెందిన సిరిగినీడి అప్పారావు, అమరావతి (49) (మృతురాలు) దంపతులు తమ కుమార్తెను పులిమేరు గ్రామానికి చెందిన మాగాపు శ్రీను అనే వ్యక్తికి ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో అల్లుడికి ఇవ్వవలసిన కట్నం తాలూకు నగదు, భూమిని చెల్లించడంలో జాప్యం జరగడంతో తరచు అల్లుడు వచ్చి అత్తమామలపై తగాదాలు పడేవాడు. ఇటీవలే అతనికి ఇవ్వవలసిన సొమ్ము కూడా ఇచ్చారు. అయితే తమ అల్లుడు అతని వదినతో చనువుగా ఉంటున్నాడని అమరావతి తరచు విమర్శిస్తుండడంతో అన్నదమ్మల మధ్య విభేదాలు పొడచూపాయి. కుటుంబంలో కలతలు రేగడంతో తీవ్ర మనస్తాపం చెందిన అన్నగారు అయిన మాగాపు అయ్యన్న దివిలి వచ్చి, తన తమ్ముడి అత్తగారైన అమరావతిపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమె తల, మెడ, వీపు, చేతులు, కాళ్లపై నరకడంతో తీవ్ర గాయాలపాలైంది. ఎడమ చేయి మణికట్టు వద్దకు తెగి పడిపోయింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం నిందితుడు కత్తితోపాటు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్సై కృష్ణ్భగవాన్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ఎస్సై తెలిపారు.