క్రైమ్/లీగల్

వృద్ధుడు సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 30: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్ధమైన ప్రమాదంలో ఒక వృద్ధుడు సజీవదహనమైన సంఘటన చిత్తూరు రూరల్ మండలం ఏనుగుండ్లపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకొంది. ఏనుగుండ్లపల్లికి చెందిన సిద్ధయ్య (72) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఒక్కడే పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి పూరిగుడిసెకు అంటుకున్నాయి. ఈ స్థితిలో మంచంలో నిద్రిస్తున్న సిద్ధయ్య అనారోగ్యం వల్ల మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, సిద్ధయ్య పూరి గుడిసె గ్రామం శివారులో ఉండటంతో గ్రామస్తులు సకాలంలో గుర్తించలేక పోయారు. మంగళవారం ఉదయం పూరిగుడిసెలో మంటల్లో కాలి మృతి చెందిన సిద్ధయ్యను గుర్తించిన గ్రామస్తులు చిత్తూరు తాలుకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.