క్రైమ్/లీగల్

వివాహిత అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 2: మండలంలోని ఫరీద్‌పేట గ్రామానికి చెందిన బుడుమూరు వెంకటలక్ష్మి అనే వివాహిత రెండేళ్ల కుమారుడు రోహిత్‌తో కలిసి అదృశ్యమయినట్లు తండ్రి కొత్తకోట బీమారావు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటలక్ష్మిని నాలుగేళ్ల క్రితం బూర్జి మండలం ఓవి పేటకు చెందిన తిరుమలరావుకిచ్చి వివాహం చేశారు. వీరు ఉద్యోగరీత్యా గుంటూరులో ఉండగా ప్రమాదవశాత్తు తిరుమలరావు మృతి చెందాడు. అప్పటినుంచి కన్నవారి ఊరైన ఫరీద్‌పేటలో కుమారుడు రోహిత్‌తో కలసి వెంకటలక్ష్మి ఉంటుంది. అయితే గురువారం శ్రీకాకుళం వెళ్లి వస్తానని ఇంటివద్ద చెప్పి తిరిగి రాలేదని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుట్కా స్వాధీనం
టెక్కలి, నవంబర్ 2: స్థానిక పాత జాతీయ రహదారిపై ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో టెక్కలి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం గుట్కా బస్తాలతో నరసన్నపేట వైపు వెళ్తున్న ఆటోను అదుపులోనికి తీసుకున్నారు. ఇందులో అక్రమంగా తరలిస్తున్న 15బస్తాలు గుట్కా సుమారు రూ.50వేలు వుంటుందని పోలీసుల అంచనా. ఈ మేరకు ఆటోతో సహా గుట్కాను స్వాధీనం చేసుకుని ఎస్ ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య
రణస్థలం, నవంబర్ 2: మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన ఉప్పల ధనలక్ష్మి (20) అనే వివాహిత ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. విజయనగరం జిల్లా పూసపాటి మండలం వెంపడాం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి పతివాడపాలెం గ్రామానికి చెందిన గురుమూర్తితో ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహమైంది. గురువారం రాత్రి పతివాడపాలెం గ్రామంలో అత్తవారింట్లో మేడమీద గదిలో ఫేన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేదింపుల వలనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డి ఎస్పీ బీమారావు, తహశీల్దార్ శ్రీరాములు శవపంచనామా చేసి పోస్ట్ మార్టంకు తరలించారు. జరిగిన సంఘటనపై జే ఆర్‌పురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరకట్నం వేధింపులపై కేసు నమోదు
కొత్తూరు, నవంబర్ 2: మండలం దిమిలి గ్రామానికి చెందిన ఆర్.మోహిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు వరకట్నం వేధింపులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ ఐ రవికుమార్ తెలిపారు. బాధితురాలు మోహిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలను ఎస్ ఐ తెలిపారు. 2010 మే 22న దిమిలి గ్రామానికి చెందిన మోహనరావుతో వివాహం జరిగిందని, అయితే తన భర్త అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తకు గ్రామానికి చెందిన గుడ్ల సురేష్, డోల వెంకటరవ