క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, నవంబర్ 3 : పట్టణంలోని మేళాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమందేపల్లి మండలం మండ్లికి చెందిన అంజినప్ప (35) మృతిచెందాడు. కూలీ పనుల కోసం వచ్చిన అంజినప్ప పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుడగా వెనుక వైపు నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్ చేరుకున్నారు. కూలీ, పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అంజినప్ప మృతి చెందడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. మృతుడి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.