క్రైమ్/లీగల్

హత్యా.. ఆత్మహత్యా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 3: త్రిపురాంతకం సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలోకి ఓ మృతదేహం కొట్టుకువచ్చిన సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గుంటూరుజిల్లావైపు నుంచి కాలువలో కొట్టుకువచ్చిన ఈ మృతదేహానికి రెండుకాళ్ళు తాళ్ళతో బంధించి ఉన్నాయని, శుక్రవారం సాయంత్రం చీకటిపడే సమయంలో ఈ మృతదేహం నీటిలో కొట్టుకురావడంతో సమీపంలో ఉన్న కొందరు సెల్‌ఫోన్ల ద్వారా ఫోటోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పాత్రికేయులకు సమాచారం చేరవేశారు. కాగా, మృతదేహానికి రెండుకాళ్ళు బంధించి ఉండటంతో హత్యగా భావిస్తున్నారు. పోలీసులు ముఖ్యమంత్రి బందోబస్తులో ఉండటంతో వారికి ఎలాంటి సమాచారం అందలేదు.