క్రైమ్/లీగల్
రైలు ఢీకొని యువకుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 4 November 2018
పుత్తూరు, నవంబర్ 4: పట్టాలు దాటుతున్న ఓ యువకుడిని గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందాడు. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆనంబట్టులో నివాసం ఉంటున్న టీకే సాయికార్తిక్ (24) ఆదివారం ద్రౌపదీదేవి ఆలయం ఎదురుగా ఉన్న రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో గూడ్స్ రైలు అతనిని ఢీకొట్టింది. స్థానికులు అతనిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినచట్లు డాక్టర్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.