క్రైమ్/లీగల్

ఆటో-కంటైనర్ ఢీకొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, నవంబర్ 5: ఆటో, కంటైనర్ ఢీకొని ఒకరు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు చినగంజాం మండలం కుండుడుచెట్లపాలెంకు చెందిన వడ్లమూడి యలమంద (31) గుంటూరు జిల్లా బాపట్లలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు స్నేహితుడు బట్టు వెంకయ్యతో కలిసి సోమవారం తెల్లవారుజామున పందిళ్లపల్లికి చెందిన వెంకటస్వామి ఆటోలో బయలుదేరారు. ఆటో వేటపాలెం బైపాస్ రోడ్డుమీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొని పక్కనే ఉన్న కుందేరు కాలువలోకి దూసుకుపోయింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యలమంద అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ వెంకటస్వామి, వెంకయ్యతోపాటు కంటైనర్ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. మృతుడు యలమందకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. చీరాల గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్సై వెంకటకృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వృద్ధురాలు మృతి
మండలంలోని దేశాయిపేట పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందింది. మంకెనవారిపాలెంకు చెందిన మార్కు సంతోషమ్మ (70) పంచాయతీ కార్యాలయంలో పింఛన్ తీసుకొని ఆర్‌సిఎం చర్చి వద్ద రోడ్డు దాటుతుండగా మోటార్‌సైకిల్ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. దీంతో బంధువులు సంతోషమ్మను చికిత్స నిమిత్తం చీరాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. వేటపాలెం ఎస్సై వెంకటకృష్ణయ్య మృతురాలి బంధువుల నుండి ఫిర్యాదు తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.