క్రైమ్/లీగల్

రెండు నిముషాలైతే ఇంటికి చేరేవారే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 6: సిరిసిల్లలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు ప్రాణాలను బలి దీసుకుంది. రెండు నిముషాలైతే అత్తవారింటిలో సపర్యలు అందుకోవాల్సి ఉండగా, ఈ వేగం వీరిని పరలోకానికి సాగనంపింది. కరీంనగర్ కట్ట రాంపూర్‌కు చెందిన కందుకూరి అనిల్ దీపావళి పండుగ సందర్బంగా అత్తవారింటిలో జరిగే శుభ కార్యక్రమం, నోముల కోసం వస్తున్నారు. అనిల్ భార్య, ఇద్దరు కుమారులతో కలిసి రెండు నిముషాలలో స్థానిక విద్యానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా, పట్టణ బైపాస్ రోడ్డులో కంటైనర్‌కు ఢీకుని ప్రమాదానికి గురయ్యారు. కారులో ఉన్న నలుగురిలో భార్య గీత గాయాలతో ప్రాణాలతో ఉండగా, అనిల్, ఇద్దరు కుమారులు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ నుండి వచ్చి సిరిసిల్ల పట్టణంలోకి ప్రవేశించిన సమయంలో ఈ దుర్ఘటన జరుగడం, అందులో ఒకే సారి ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం అందరినీ కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు పిల్లలు, ఇంకా ఎంతో ఎదగాల్సిన అనిల్ ఉన్న పలంగా గద్ద ఎత్తుకుపోయినట్టు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బంధు మిత్రులు తీవ్ర విషాదంలోకి నెట్టి వేసింది. సంఘటనలో తీవ్ర గాయాలతో బయట పడిన అనిల్ భార్య గీత విషమ పరిస్థితిలో ఉండడంతో ఇక్కడి నుండి కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.