క్రైమ్/లీగల్

ప్రాణం మీదకు తెచ్చిన భూ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 9: పాత కక్షలు ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన సంఘటన శుక్రవారం వర్ని మండలం చందూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం చందూర్ గ్రామానికి చెందిన శేషగిరి భూమ్‌రెడ్డి, సుధాకర్ అనే వ్యక్తి మధ్య గత కొనే్నళ్లుగా భూ వివాదానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయని అన్నారు. చందూర్ గ్రామ శివారులో అటవీ శాఖకు చెందిన భూమి విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితులు దాడికి దారి తీశాయని అన్నారు. ఇదే క్రమంలో అటవీ ప్రాంతంలో గల భూమిని చదును చేసేందుకు శుక్రవారం ఉదయం భూమ్‌రెడ్డి తన కొడుకు విజయ్‌కాంత్‌రెడ్డితో కలిసి వెళ్లగా, అక్కడ సుధాకర్‌తో చిన్నపాటి గొడవ జరిగిందన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సుధాకర్ ఇంటికి వెళ్లి తల్వార్ తీసుకుని రోడ్డుపై కాసి, భూమ్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై వస్తుండగా దాడి చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో భూమ్‌రెడ్డి ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపోగా, చేతుకు, మెడకు గాయాలయ్యాయని, బాధితున్ని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. దాడి అనంతరం నిందితుడు సుధాకర్ లొంగిపోవడం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.