క్రైమ్/లీగల్

ఆస్తి కోసం అక్క హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, డిసెంబర్ 20: ఆస్తి వివాదం ఒక కుటుంబంలో చిచ్చురేపింది. భర్తతో విడాకులు పొంది తమ చెంత ఆశ్రయం పొందుతున్న బిడ్డను మమకారం మరిచిన తల్లిదండ్రులు, అక్క అనే ఆత్మీయతను కోల్పోయిన తమ్ముడు కిరాతకంగా హతమార్చాడు. మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకున్న వివరాలు... ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కే.మైసయ్య నిర్మలమ్మ దంపతుల కుమార్తె కే.శివనందిని (38) భర్తతో విడాకులు తీసుకుని కుమారుడితో కలిసి పుట్టింట్లో ఉంటుంది. మైసయ్య కుమారుడు కే.సిద్దార్థ (32) వనపర్తి డివిజన్ నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పని చేస్తున్నాడు. వనస్థలిపురంలో వారికి చెందిన ఇంటిస్థలం విషయమై శివనందినికి కుటుంబ సభ్యులకు కొంతకాలంగా వివాదం నడుస్తుంది. దీంతో సిద్దార్థ్ తల్లిదండ్రులతో కలిసి ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రుల సహకారంతో సిద్దార్థ్ శివనందిని గొంతు నులిమి హతమార్చాడు. మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని బాత్‌రూంలో పడవేశారు. అనవాళ్లు తెలియకుండా ఉండటం కోసం ఆమె మృతదేహంపై హార్పిక్ ద్రావణాన్ని చల్లారు. బుధవారం ఏమి తెలియనట్లు నటిస్తూ సిద్దార్థ్ తల్లిదండ్రులతో కలిసి మలక్‌పేట పోలీసులకు సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. గురువారం వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకుని వెళ్లిన పోలీసులు వారి ఇంటి బాత్‌రూంలో విగతజీవిగా పడి ఉన్న శివనందిని మృతదేహాన్ని గుర్తించారు. తమదైన శైలిలో సిద్దార్థ్‌ను విచారించగా తల్లిదండ్రులతో కలిసి సోదరిని హత్య చేసినట్లు తెలిపారు. సిద్దార్థ్‌ను తల్లి నిర్మలమ్మను రిమాండ్‌కు తరలించిన పోలీసులు అంత్యక్రియల అనంతరం తండ్రి మైసయ్యను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.