క్రైమ్/లీగల్

గుట్కా గోదాములపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: నిషేధిత గుట్కాను రూపుమాపేందుకు విజిలెన్స్ జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. గురువారం వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి గోదాముల్లో నిల్వ చేసిన గుట్కా నిల్వలను భారీ ఎత్తున పట్టుకున్నారు. నిషేధిత గుట్కాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు జిల్లాలో గుట్కా వల్ల అనర్ధాలను తెలియజేసేందుకు వైద్యాధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. గుట్కా నిల్వలను దాడి చేసి పట్టుకోవడమే కాకుండా అసలు గుట్కా అలవాటునే మానిపించేందుకు విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు వైద్యులతో కలిసి జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టడం విశేషత సంతరించుకుంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిషేధించిన గుట్కాపై విజిలెన్స్ అధికారులు రాజమహేంద్రవరం, తుని, పెద్దాపురం ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు 39 లక్షల విలువైన గుట్కా, గుట్కా తయారీకి సామాగ్రిని సీజ్ చేసి బాధ్యులైన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గుట్కాను అమ్మడం గానీ, తయారు చేయడం గానీ ఎవరైనా చేసినట్టయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని నిషేధిత గుట్కాను తయారు చేసిన, విక్రయించినా, నిల్వ చేసిన వారి వివరాలను విజిలెన్స్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చినట్టయితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను విజిలెన్స్ ఎస్పీ నెంబర్ 8008203261కు గానీ, 0883 2566662కు గానీ తెలియజేయాల్సిందిగా కోరారు.
అడిషనల్ డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ పి కోమలి మాట్లాడుతూ గుట్కాను తినడం వల్ల అధిక సంఖ్యలో పురుషులు కేన్సర్ భారీన పడి చనిపోతున్నారని, అందువల్ల ప్రభుత్వం నిషేధించిందన్నారు. మత్తు పదార్ధమైన గుట్కా, పాన్, జర్ధాలకు బానిసైన పురుషులు వివిధ రకాల కేన్సర్‌లకు గురవుతున్నారని, అందువల్ల ప్రజలు వాటికి దూరంగా ఉండాలన్నారు.