క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, : కైకలూరు కో-ఆపరేటీవ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆలపాటి సాయి బాబు శుక్రవారం సాయంత్రం రూ.30వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విజయవాడ ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం కైకలూరుకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీమ్ కన్స్యూమర్ సెంట్రల్ కో-ఆపరేటీవ్ స్టోర్స్ (కెసీసీసీఎస్) బిజినెస్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 19వేల 802 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆడిట్ విషయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తంలో లంచం ఇవ్వడానికి ఇష్టపడని రహీమ్ విషయాన్ని ఎసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఎసీబీ అధికారుల ముందస్తు పథకంలో భాగంగా రహీమ్ రూ.30వేలు నగదును కార్యాలయంలో ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు. ఇదే సమయంలో ఎసీబీ అధికారులు దాడి చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.30వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.