క్రైమ్/లీగల్

సుప్రీంకు సజ్జన్ హైకోర్టు తీర్పుపై అప్పీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రాజధాని ఢిల్లీలో సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1984 కేసులో ఢిల్లీ హైకోర్టు కుమార్‌కు జీవించి ఉన్నంత కాలం కారాగార శిక్ష విధిస్తూ ఇటీవలే తీర్పునిచ్చింది. సజ్జన్‌కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు రిజిస్ట్రీనుంచి తనకు సమాచారం అందిందని బాధితుల తరఫున కోర్టులో వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా వెల్లడించారు. కుమార్‌కు సంబంధించి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దంటూ సిక్కు బాధిత కుటుంబాలు ఇంతకు ముందే సుప్రీం కోర్టు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 34 ఏళ్ల నాటి కేసులో కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కు ఢిల్లీ హైకోర్టు ఈనెల 17న యావజ్జీవ శిక్ష విధించింది. 1984లో ఢిల్లీ రాజ్‌నగర్‌లో జరిగిన సిక్కు కుటుంబ హత్య కేసులో అతడికి శిక్ష పడింది. రాజ్‌నగర్ ఫేజ్-1 ప్రాంతంలోని పాలం కాలనీలో 1984 నవంబర్ 1-2 తేదీల్లో ఐదుగురు సిక్కులు దారుణ హత్యకు గురయ్యారు.