క్రైమ్/లీగల్

చైన్ స్నాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 24: ఇంటి ముందు పూలు కోస్తుండగా మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్డుకునేందుకు యత్నించిన వ్యక్తిపై దుండుగులు కర్రలతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో అనసూజ అనే మహిళ నివసిస్తోంది. సోమవారం ఉదయం దేవాలయానికి వెళ్లేందుకు అనసూజ పూలు కోస్తుంది. ఆ సమయంలో అటు వైపుగా ఎవరూ లేకపోవడంతో ఇద్దరు దుండగులు హెల్మెట్లను ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చారు. పూలు కోస్తున్న అనసూజ వద్దకు వెళ్లి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లారు. వెంటనే అనసూజ అరువడంతో గమనించి అడ్డుకునేందుకు వ్యక్తి ప్రయత్నించాడు. దుండగులు తమ వద్ద ఉన్న కర్రలతో దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ సురేష్ సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.