క్రైమ్/లీగల్

జనవరి 4న సుప్రీం ముందుకు అయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: బాబరీ మసీదు- రామజన్మభూమి స్థల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను జనవరి 4న సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ ఆంశం ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ బెంచి ముందు ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన మొత్తం 14 పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం నాలుగు సివిల్ దావాలకు సంబంధించి అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఆ తీర్పును వెలువరించింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని మూడు పక్షాలకు (సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లల్లా) సమానంగా పంచాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన సవాలు పిటిషన్లను జనవరి మొదటి వారంలో సముచిత ధర్మాసనానికి నివేదిస్తామని, ఆ ధర్మాసనమే వీటిపై విచారణ షెడ్యూలును ప్రకటిస్తుందని అక్టోబర్ 29న సుప్రీం కోర్టు తెలిపింది. అయితే ఈ పిటిషన్ల విచారణ తేదీని ముందుకు తీసుకురావాలంటూ మధ్యలో అప్పీలు దాఖలైనప్పటికీ దాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.