క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, డిసెంబర్ 26: నరసరావుపేట నుండి గొర్రెలతో సత్తెనపల్లి వెళుతున్న సమయంలో బుధవారం తెల్లవారుఝామున మండలంలోని ములకలూరు గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఇసుకలోడులో వస్తున్న లారీ గొర్రెలను ఢీకొనడంతో 24గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, 11 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన మల్లా నాగరాజు గోర్రెలను మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. మల్లా శ్రీనివాసరావు, మల్లా నాగార్జున, మల్లా రామాంజనేయులు కల్సి సుమారు 300 గొర్రెలను గ్రామాల మీదుగా మేపుకుంటూ వెళుతుంటామని తెలిపారు. అదే విధంగా బుధవారం సత్తెనపల్లి వెళ్ళేందుకు ప్రకాశం జిల్లా కొప్పరపాలెం నునండి బయలుదేరి తెల్లవారుఝాము సమయంలో నరసరావుపేట మీదుగా సత్తెనపల్లి వెళ్తుండగా సత్తెనపల్లి వైపు నుండి ఇసుక లోడుతో వస్తున్న ఏపీ లారీ గొర్రెలపైకి వచ్చిందన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 24 గొర్రెలు చనిపోగా, 11గోర్రెలు చావుబతుకుల్లో ఉన్నాయని యజమానులు తెలిపారు. ఈ మేరకు నరసరావుపేట రూరల్ సిఐ మల్లయ్యకు ఫిర్యాదు చేశారు. సీఐ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.