క్రైమ్/లీగల్

బొలేరో బోల్తా..ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 26 : బొలెరో వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయిన సంఘటన మండల పరిధిలోని గొల్లవాండ్లపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నామాల గ్రామానికి చెందిన గాండ్ల మల్లికార్జున (34)కు బోరుబావుల మోటార్ల మరమ్మతు వాహనం వుంది. అయితే పని ముగించుకుని వెళుతుండగా గొల్లవాండ్లపల్లి గ్రామ బస్టాండ్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాండ్ల మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా అందులో వున్న ముగ్గురు రేణుకమ్మ, ముత్యాలు, భాస్కర్‌లకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెనే్నకొత్తపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మల్లికార్జున శవాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేజీబీవీలో మిద్దెపై నుంచి జారిపట్ట విద్యార్థిని
* ప్రమాదంపై తల్లిదండ్రులు అనుమానం...
కంబదూరు, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని కేజీబీవీలో ఎనిమిదవ తరగతి మేఘన ప్రమాదవశాత్తు మిద్దెపై ఉతికిన దుస్తులు తీసుకొచ్చేందుకు వెళ్లి కాలుజారి కింద పడి తీవ్రగాయాలైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు ఉదయం 8 గంటల సమయంలో పాఠశాల మిద్దెపై ఉతికిన దుస్తులు తీసుకొచ్చేందుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కిందికి పడి గాయాలపాలైంది. వెంటనే గమనించిన సిబ్బంది 108 ద్వారా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. విద్యార్థిని మొహం, కుడికాలుకు బలమైన గాయాలయ్యాయి. కాగా ఘటన పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు సైతం ఆందోళన చేపట్టి అనుమానం వ్యక్తం చేశారు. విషయాన్ని డీఈఓ దృష్టికి వెళ్లడంతో వివరాలు అందించాలని ఎంఈఓ సాయికృష్ణను ఆదేశించారు.