క్రైమ్/లీగల్

దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం, డిసెంబర్ 26: జిల్లాలో వివిధ రకాల దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బొలెరో వాహనం, రూ. 6లక్షల నగదు, పోలీస్ యూనిఫాం, వైర్లెస్ సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. బుధవారం ఎస్సై మాట్లాడుతూ ఎనిమిది మంది ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేసేవారని తెలిపారు. వీరు వాహనాలు, నగదు, బంగారు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి వారని, ఒక చోట చేరాలని నమ్మించి వారు చెప్పిన చోటుకు వచ్చిన వెంటనే పోలీస్ డ్రెస్ వేసుకొని వారి వద్ద నుంచి నగదు, బంగారం దోచుకొని వెళ్లేవారని చెప్పారు. ఇలా చాలాసార్లు ప్రజలను మోసగించారన్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని బండ్లదొడ్డి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలోని రాజా, కిరణ్, సంజయ్ పారిపోయారు. ముద్దాయిలు శంకర్, ద్యాసిమర్, తిరుమల, రాజేష్, మదన్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.